YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సొంత మనుషులతో సబ్ కమిటీలు

సొంత మనుషులతో సబ్ కమిటీలు

సొంత మనుషులతో సబ్ కమిటీలు
రాజమహేంద్రవరం డిసెంబర్ 28
రాజధాని మార్పు అంశంపై తూర్పుగోదావరి జిల్లాలో అఖిలపక్షం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ మాట్లాడుతూ 33.771 ఎకరాలు 29754 మంది రైతుల భూములు  సీఆర్డీఏ కి ఇచ్చారని, ఒక  ఎకరం లోపు 20422 మంది  రైతులు ఉన్నారని అన్నారు. మెట్టభూమి,  నీటి వసతి కలిగిన భూమి అమరావతిలో ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ తీర్మానం సెప్తిబర్ 14 లో అమరావతి లో రాజధాని కట్టాలని తీర్మానం చేశామని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అమరావతి పై నిందలు వేసుకుంటూ వెళ్తున్నారని, 6 నెలల్లోనే 29 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. సొంత మనుషులతో సబ్ కమిటీలు వేస్తున్నారని అన్నారు. మంగళగిరి, తెనాలి, గుంటూరు అమరావతి పట్టణాలు  అభివృద్ధి చేసుకోవాలని, గత ప్రభుత్వ హాయంలో రైతులందరికీ పత్రాలతో హామీ ఇచ్చిందని, వాళ్లందరికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts