YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరీంనగర్ లో రెచ్చిపోయిన మందుబాబులు

కరీంనగర్ లో రెచ్చిపోయిన మందుబాబులు

కరీంనగర్ లో రెచ్చిపోయిన మందుబాబులు
కరీంనగర్, డిసెంబర్ 30,
కరీంనగర్‌లో జిల్లాలో మందుబాబులు రెచ్చిపోయారు. ఎక్కడా చోటు లేనట్లు ఏకంగా రైలు పట్టాలపైనే మద్యం తాగుతూ హల్‌చల్ చేశారు. రైలు వస్తే ప్రాణాలు పోతాయన్న భయం కూడా లేకుండా ముచ్చట్లు చెప్పుకుంటూ పట్టాలపైనే ఫుల్లుగా మద్యం తాగుతూ పార్టీ చేసుకున్నారు. ఈ తతంగమంతా డ్రోన్ కెమెరాకు చిక్కడంతో వారంతా ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో ఆదివారం బహిరంగంగా మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బ్యాచ్ చెట్ల టున మద్యం తాగుతుండగా.. నలుగురు యువకులు ఏకంగా రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో పోలీసులు డ్రోన్ కెమెరాతో ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్న సమయంలో ఈ దృశ్యాలు వారి కంట పడ్డాయి. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని మందుబాబులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.అరెస్టయిన వారిలో కరీంనగర్‌కు చెందిన టి. శ్రీకాంత్, జి.లక్ష్మణ్, ఎం. రంజిత్, బొమ్మకల్‌కు చెందిన జి.లంకేష్, పెద్దపల్లికి చెందిన కె.రాజేష్, దుర్షేడ్‌కు చెందిన వి.సాయి, టి.వేణు, ఎం.వంశీ, మానకొండూరుకు చెందిన కె.రాకేష్, వికారాబాద్కు చెందిన కె.సాయి కిరణ్‌ ఉన్నారు. బహిరంగ ప్రదేశాలతో పాటు అత్యంత ప్రమాదకరంగా రైలు పట్టాలపై మద్యం సేవించడంతో పోలీసులు వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Related Posts