YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30 ఏళ్ల ప్రేమ.. 67 ఏళ్ల వయస్సులో పెళ్లి..

30 ఏళ్ల ప్రేమ.. 67 ఏళ్ల వయస్సులో పెళ్లి..

30 ఏళ్ల ప్రేమ.. 67 ఏళ్ల వయస్సులో పెళ్లి...
తిరువనంతపురం, డిసెంబర్ 30,
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో పెద్దల వల్ల దూరమయ్యే జంట.. 9 నెలల తర్వాత ఊహించని విధంగా కలిసి, పెళ్లితో ఒక్కటవుతారు. ఇది కూడా అలాంటి కథే. కానీ, ఇది ఓ క్లీన్ లవ్ స్టోరీ. 30 ఏళ్ల కిందట కళ్లతోనే ప్రేమించుకున్న ఓ జంట.. మధ్యలో అనివార్య కారణాల వల్ల దూరమయ్యారు. ఇటీవల ఊహించని విధంగా కలుసుకున్నారు. ఈసారి చావు తప్ప మరేదీ తమని దూరం చేయకూడదంటూ.. పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ అరుదైన ఘటన కేరళలోని త్రిస్సుర్ జిల్లా రామవరంపురంలో చోటుచేసుకుంది.67 ఏళ్ల కొచానియన్ మీనన్, 65 ఏళ్ల లక్ష్మీ అమ్మాల్‌లు 30 ఏళ్ల కిందటే ఒకరినొకరు ఇష్టపడ్డారు. బాల్యం నుంచే వారికి పరిచయం ఉండటంతో స్నేహంగా మెలిగేవారు. కానీ, ప్రేమను వ్యక్తం చేసుకోలేకపోయారు. వారి మధ్య మాటలు ఉన్నా.. దాన్ని స్నేహంగానే భావించారు. ఆ తర్వాత కొన్నాళ్లు అనుకోకుండా దూరమయ్యారు. అలా దూరమైన వాళ్లు.. ఇక కలుసుకోలేకపోయారు. అయితే, కొచానియన్ మీనన్ ఇటీవల కేరళ ప్రభుత్వానికి చెందిన వృద్ధాశ్రమంలో చేరాడు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మీ అమ్మల్ కూడా అక్కడే చేరింది. ఆమెను చూడగానే కొచానియన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమించిన వ్యక్తి దూరమైతే కలిగే బాధను ప్రత్యక్షంగా అనుభవించిన వారిద్దరూ.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడి.. పెళ్లి చేసుకున్నారు. ప్రేమకు వయస్సుతో పనిలేదని నిరూపించారు. ఈ పెళ్లికి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ పెద్దగా వ్యవహరించారు. దగ్గరుండి ఆ వృద్ధ జంటకు పెళ్లి జరిపించారు.

Related Posts