YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎంపీ , టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ , టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ , టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఇల్లు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో రాయపాటికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రాయపాటికి చెందిన ట్రాన్ ట్రాయ్ కంపెనీలో కూడా సోదాలు చేస్తున్నారు. రూ. 300 కోట్ల బ్యాంకు నుంచి రాయపాటి కంపెని రుణాలు తీసుకున్నాయి. అయితే తీసుకున్న రుణం ఇంతవరకు చెల్లించలేదు. దీంతో రాయపాటి కంపెనీ పై కేసు నమోదు చేసింది సీబీఐ. రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts