పౌరసత్వ చట్టం.. ఏ ఒక్క భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30,
పౌరసత్వ సవరణ చట్టం.. ఏ ఒక్క భారతీయ పౌరుడికి వ్యతిరేకం కాదు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. సీఏఏకు అనుకూలంగా ఇవాళ హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ చట్టం విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. 2015లో లోక్సభలో సీఏఏ పాసైడనప్పుడు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. ఈ అంశంపై రాహుల్తో చర్చించేందుకు బీజేపీ వర్కర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా రాహుల్తో డిబేట్కు రెఢీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సీఏఏలో భారతీయ ముస్లింల గురించి కానీ ఇతర మతాలు గురించి కానీ ఎటువంటి అంశం లేదన్నారు. భారతీయ ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్నోలో ప్రియాంకా గాంధీ భద్రతా నియమావళిని ఉల్లంఘించినట్లు జర్నలిస్టులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గాంధీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికీ భద్రత నియమావళిని ఉల్లంఘించి అలవాటు ఉందన్నారు. సెక్యూర్టీ అధికారులకు తెలియజేయకుండానే టూర్లు చేయడం వాళ్లకు అలవాటుగా మారిందన్నారు. అలాంటి వాళ్లు భద్రత గురించి ప్రశ్నించే హక్కు లేదన్నారు.