YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాకు రాజధానులు వద్దు బెంగుళూరుముద్దు మమ్మల్ని కర్ణాటక వాసులుగా గుర్తించండి రాజధానులు మారితే మేము మారాలా?  ఒక్క రాజధానికి గతి లేదు మూడు రాజధానులు దేనికి తెలుగుదేశం తిక్క రెడ్డి

మాకు రాజధానులు వద్దు బెంగుళూరుముద్దు మమ్మల్ని కర్ణాటక వాసులుగా గుర్తించండి రాజధానులు మారితే మేము మారాలా?  ఒక్క రాజధానికి గతి లేదు మూడు రాజధానులు దేనికి తెలుగుదేశం తిక్క రెడ్డి

 మాకు రాజధానులు వద్దు బెంగుళూరుముద్దు మమ్మల్ని కర్ణాటక వాసులుగా గుర్తించండి
రాజధానులు మారితే మేము మారాలా? 
ఒక్క రాజధానికి గతి లేదు మూడు రాజధానులు దేనికి తెలుగుదేశం తిక్క రెడ్డి
కౌతాళం డిసెంబర్ 31 
ఒక్క రాజధానికి గతి లేదు మూడు రాజధానులు దేనికి అని టీడీపీ ఇన్ ఛార్జ్ తిక్క రెడ్డి మండిపడ్డారు.మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు మేము కర్ణాటక వాసులము అప్పుడు మాకు బళ్లారి జిల్లా గా ఉండేది మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి తరుపున మాకు ఆదోని తాలూకా బళ్లారి తాలూకా గా మారింది.1956 వరకు మేము కర్ణాటక వాసులము అయితే ఆంద్ర వాసులము అని కర్నూలు రాజదాని గా మార్చారు. అది కాస్తా పోయి హైదరాబాద్ గా మార్చారు. అయిన సర్దుకొని పోయాం మన ఆంధ్రప్రదేశ్ విడిపోయి అమరావతి రాజధాని గ మార్చారు. అయిన సర్దుకుని పోయాం ఇప్పుడు విశాఖ పట్టణం అంటే మేము కేవలము జర్నీ వాసులము మాత్రమే మనము రాజధాని కి పోవలంట్ రెండు రోజులు అవుతుంది అనగా మనం ప్రయాణానికి మాత్రమే అందుకని మాకు కర్ణాటక లో కలిపేయండి మేము ఆనందంగా ఉంటాము,మూడు పూటలా కరెంటు మూడు పూటలా నీళ్లు మాకు అందుబాటులో ఉంటాయి. మహా ప్రభు మాకు మాకు బళ్లారి జిల్లాల్లో కలిపేయండి. మా బతుకులు బతుకుతం. మీరు ఎన్ని రాజధానూలు అయిన చేసుకోండి మీ ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకోండి మేము మా ప్రజలు బాగుండాలి అంటే మమ్మల్ని కర్ణాటక వాసులుగా గుర్తించాలని కోరారు. మనకు వచ్చే నిధులు, ప్రాజెక్టులు నిలిపివేసి కర్నూలు కు హైకోర్టు విశాఖపట్నం లో అసెంబ్లీ అని అంటున్నారు. మరి అవి ఉంటే మనకు ఏంటి లాభం అని వాపోయారు. మనకు కావాల్సింది అభివృద్ధి రైతులకు కావలసింది వ్యవసాయ నికి నీళ్లు అవి అందిస్తే చాలు అవి ఇవ్వకా పోతే మాకు బళ్లారి లో కలిపేయండి మహా ప్రభు చేతులు ఎత్తి దణ్ణం పెట్టారు.మాకు రాజధానులు వద్దు మాకు బెంగుళూరు ముద్దు అని మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Posts