చంద్రబాబు అసత్య ప్రచారం
విశాఖపట్నం డిసెంబర్ 31
ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అపూర్వ స్వాగతాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతిపాదించిన సీఎంకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. సీఎం వైయస్ జగన్కు వచ్చిన అపూర్వ స్వాగతాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు రకరకాల మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాబు అర్థరహిత మాటలు ఆయనకు మతిబ్రమించిందా అన్న అనుమానం కలిగిస్తోందని అన్నారు.