ప్రతి వాడలో సీసీ రోడ్లు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మంత్రాలయం డిసెంబర్ 31
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి వాడలో సీసీ రోడ్లు వేయించడం జరుగుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో రూ 30 లక్షలతో నూతనంగా వేయనున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి జరగలేదని ఆవేదనచెందారు. వైకాపా ప్రబుత్వంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లకు అవసరమైన ప్రతిపాదనలు పంపిన వెంటనే మంజూరు అవుతున్నాయని తెలిపారు. సీసీ రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డితో కలిసి నియోజకవర్గ ప్రజలకు, అధికారులకు, వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు.