పార్టీ మారను
విశాఖపట్నం డిసెంబర్ 31
పార్టీ మారతారంటూ తనపై పదే, పదే తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. తనకు అసలు పార్టీ మారే ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చారు.విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని గంటా తెలిపారు. విశాఖ వాసిగా.. 30 ఏళ్లు రాజకీయాలతో నగరంలో అనుబంధం ఉందని.. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశం విశాఖ కల్పించిందని.. అందుకే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. గంటా శ్రీనివాస్ రావు అన్నారు.అమరావతి కోసం 33వేల ఎకరాల భూముల్ని త్యాగం చేసిన రైతులకు న్యాయం చేయాలన్నారు.అమరావతి రైతులు కొద్ది రోజులుగా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని గంటా గుర్తు చేశారు. రైతుల కోసం పార్టీ అధిష్టానం న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపు ఇచ్చిందని.. తాను సైతం ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్నానని చెప్పారు. రైతులకు మద్దతుగా నిలవాలన్న చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని అన్నారు.