YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భువనేశ్వరితో కలిసి బాబు ధర్నా

భువనేశ్వరితో కలిసి బాబు ధర్నా

భువనేశ్వరితో కలిసి బాబు ధర్నా
అమరావతి, డిసెంబర్ 31,
అధినేత చంద్రబాబు మరోసారి అమరావతి ప్రాంత పర్యటనకు సిద్ధమయ్యారు. జనవరి 1 నాడు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈసారి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతికి వెళుతున్నారు. రైతులకు సంఘీభావంగా జనవరి 1న రైతుల మధ్య ఉండాలని.. వారికి అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో చంద్రబాబు దంపతులు పర్యటిస్తారు. అంతేకాదు ఇద్దరూ ధర్నాలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది.ఇటు టీడీపీ న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. ఎవరూ బొకేలు, కేక్‌లు తీసుకురావొద్దని అధినేత కోరారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నారు.‘ఆంధ్రప్రదేశ్‌లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. నూతన సంవత్సర వేడుకల కోసం చేసే ఖర్చులను పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు విరాళంగా ఇవ్వాలి. ఆరోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉందాం’అని ట్వీట్ చేశారు చంద్రబాబు

Related Posts