సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సోమేశ్కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 31
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్కుమార్ సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కే జోషి పదవీ విరమణతో సోమేశ్కుమార్ను ప్రభుత్వం రాష్ట్ర నూతన సీఎస్గా నియమించింది. తన నియామకం పట్ల సోమేశ్కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్గా సోమేశ్కుమార్ 31 డిసెంబర్, 2023 వరకు కొనసాగనున్నారు.