YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

 ఈ-కామర్స్ రంగంలో మార్పులకు ముఖేష్ అంబానీ అడుగులు

 ఈ-కామర్స్ రంగంలో మార్పులకు ముఖేష్ అంబానీ అడుగులు

 ఈ-కామర్స్ రంగంలో మార్పులకు ముఖేష్ అంబానీ అడుగులు
ముంబై డిసెంబర్ 31   
టెలికాం రంగంలో జియోను అందుబాటులోకి తెచ్చి పెను మార్పులతో సంచలనానికి తెరలేపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఈసారి ఈ-కామర్స్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మాదిరిగానే జియో‌మార్ట్ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను 2020లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే.. తొలి దశలో మహారాష్ట్రలోని ముంబై, థానే, కళ్యాణ్ నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి.. అనంతరం దేశవ్యాప్తంగా ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరపనున్నట్లు తెలిసింది. అంతేకాదు, త్వరలో జియోమార్ట్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Related Posts