YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పూర్వవైభవం రావాలి

పూర్వవైభవం రావాలి

పూర్వవైభవం రావాలి
అమరావతి జనవరి 01
నూతన సంవత్సరం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిర్మాణాత్మక రాజకీయపార్టీగా టిడిపి పనిచేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం తన నివాసానికి వచ్చిన సందర్శకులతో అయన మాట్లాడారు. అమరావతిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి. పేదలకు, రైతులకు,మహిళలకు అండగా ఉండాలి.  జరిగిన నష్టం నుంచి అమరావతి కోలుకోవాలి. అందుకే నూతన సంవత్సర వేడుకలకు దూరం. ఆ ఖర్చులు రైతులు, రైతుకూలీల కోసం పనిచేసే జేఏసిలకు ఇవ్వాలని అన్నారు. గత 7నెలల్లోనే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది.   జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం బైటపడాలి. ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం రావాలి.  గాడితప్పిన పాలన మళ్లీ సక్రమ బాట పట్టాలి. అందరికీ అన్నివిధాలా స్ఫూర్తినిచ్చే  సంవత్సరం కావాలి. నూతన సంవత్సరం అందరికీ కలిసి రావాలని అయన అన్నారు.

Related Posts