చేతి గాజులు విరాళంగా ఇచ్చిన భువనేశ్వరి
అమరావతి జనవరి 01
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతుల నిరసన దీక్షలు 15వ రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఎర్రబాలెం గ్రామంలో రైతుల దీక్షలో కూర్చుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి తన చేతికి ఉన్న గాజులు తీసి అమరావతి ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. భువనేశ్వరి మాట్లాడుతూ... ‘‘మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నా. ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకు