YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రివిధ దళాల ఏకేకరణే లక్ష్యం

త్రివిధ దళాల ఏకేకరణే లక్ష్యం

త్రివిధ దళాల ఏకేకరణే లక్ష్యం
న్యూఢిల్లీ జనవరి 1  :
భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ జాతీయ యుద్ధ స్మారకం చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.  అనంతరం ఆయన సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.  ఈ సందర్భంగా జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక జట్టుగా కలిసి పని చేస్తాయన్నారు.  త్రివిధ దళాలకు చెందిన మంచి ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు. దళాల ఏకీకరణపై దృష్టి పెడుతాం.  శిక్షణను ఎలా ఏకీకరణ చేయాలో దానిపై తాము దృష్టి సారిస్తామన్నారు. ఈ మేరకు సీడీఎస్కు పని అప్పగించారు.  ఇంకా ఏమైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తాం.  త్రివిధ దళాల మధ్య సమన్వయం, వనరుల ఏకీకరణే లక్ష్యమని జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు.  తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాం.  అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పని చేస్తామని బిపిన్ రావత్ తేల్చిచెప్పారు.

Related Posts