కేసీఆర్ కు మానవత్వం లేదు
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రంగారెడ్డి జనవరి 2
కేసీఆర్ ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నెరవేస్తున్నాడు. రైతు రుణమాఫీ ఎక్కడ ? నిరుద్యోగ భృతి ఏది?రైతు బంధు ఎక్కడికి పోయింది కేసీఆరని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. గురవారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆధిభట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. కేసీఆర్ కు పేద,బడుగు బలహీన వర్గాలంటే పట్టింపే లేదు. కేసీఆర్ కు మానవత్వం లేదు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ అంచనా వేయవద్దని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెలో ఉంది. మునిసిపల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెల్పించాలని అన్నారు. ప్రశ్నించే గొంతుక ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటి కంపెనీలను ఓటర్ రింగ్ రోడ్డు లను తెచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపించాం. టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీ పేరిట ప్రజలను అనారోగ్యం బారిన పడేవిధంగా చేస్తుందని విమర్శించారు.