YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై బోత్స షాకింగ్ కామెంట్స్

చంద్రబాబుపై బోత్స షాకింగ్ కామెంట్స్

చంద్రబాబుపై బోత్స షాకింగ్ కామెంట్స్
విజయవాడ, జనవరి 2,
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని మరోసారి టార్గెట్ చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ.
రాజధాని అమరావతికి సంఘీభావం తెలుపుతూ చంద్రబాబు సతీమణి తన గాజులు ఇవ్వడంపై మంత్రి బొత్స తనదైన శైలిలో స్పందించారు. ఇవ్వాల్సింది గాజులు కాదని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొన్న భూములివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.చంద్రబాబుకి అసహనం పెరిగిపోయిందన్న బొత్స.. వైఎస్ వల్లే ఆయన మంత్రి అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు రాజకీయ ఎదుగుదలలో.. ఆయనకు మంత్రి పదవి రావడంలో అంగుళంఅంగుళంలో వైఎస్ సాయం ఉందన్నారు. అది తనకు అప్పటి పెద్దలు చెప్పారని బొత్స వ్యాఖ్యానించారు. జీవితాంతం ముఖ్మమంత్రిగా ఉంటానని చంద్రబాబు అనుకున్నారని.. ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందన్నారు.గత ఐదేళ్లలో రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేసి ఉంటే ఇప్పుడు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆయన విమర్శలు చేశారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారని.. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని 13 జిల్లాలు ఎలా అభివృద్ధి చెందుతాయో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్.. అందుకే అభివృద్ధి చెందిందన్నారు. రాజధానిపై అధ్యయనానికి నియమించిన నిపుణుల కమిటీ విశాఖపట్నం అయితే వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నివేదికలో సూచించిందని బొత్స తెలిపారు. హైదరాబాద్‌కి మించి అభివృద్ధి జరిగే అవకాశం విశాఖకు ఉందని.. మరో ముంబైలా తయారవుతుందని బొత్స వ్యాఖ్యానించారు. అందుకే రాజధాని ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు.

Related Posts