YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బ్రీజ్ కిషోర్ కి తెరాస సర్కార్ చేయూత

Highlights

జిమ్నాస్టిక్ అరుణ్ రెడ్డి కోచ్ కీ

తెలంగాణ మంత్రి పరామర్శ

రూ.25లక్షల చెక్ అందజేత

బ్రీజ్ కిషోర్ కి తెరాస సర్కార్ చేయూత

హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్స్ ట్రోఫీ లో రజత పతకం సాధించిన అరుణ రెడ్డి కోచ్ ఎన్. బ్రిజ్ కిషోర్ ను కలిసి పరామర్శించి, 25 లక్షల రూపాయల చెక్కును అందజేసిన తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి టి. పద్మారావు గౌడ్, తెలంగాణ రాష్ట్ర క్రీడల కార్యదర్శి, బుర్రా వెంకటేశం. జిమ్నాస్టిక్ కోచ్ ఎన్. బ్రిజ్ కిషోర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం ను అందిస్తామన్నారు క్రీడా శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రిజ్ కిషోర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జిమ్నాస్టిక్ కోచ్ ఎన్. బ్రిజ్ కిషోర్ ను పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, శాట్స్ VC&MD దినకర్ బాబు పాల్గొన్నారు.

Related Posts