YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ : టీడీపీ నేతలు

బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ : టీడీపీ నేతలు

బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ : టీడీపీ నేతలు
విజయవాడ జనవరి 3
: రాజధాని అమరావతి భవితవ్యంపై నివేదిక ఇవ్వనున్న బోస్టన్ కమిటీపై టీడీపీ నేతలు తవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ అని విమర్శించారు. న్యూయార్క్ అవతల బోస్టన్ నగరంలో ఉన్న సంస్థ బోస్టన్ సంస్థ అని... అమెరికాలో ఉన్న బోస్టన్ సంస్థకు అసలు అమరావతి మీద అవగాహన ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతిలో ఏమేమీ ఉన్నాయో, ప్రజలు.. వారి విధానాల గురించి ఏదైన అవగాహన ఉందా అని నిలదీశారు. జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌నే బోస్టన్ కమిటీ ఇస్తుందని వారు అన్నారు. హైపర్ కమిటీ కూడా ఓ బోగస్ కమిటీ అని ఈ బోగస్ కమిటీలు వేసి రాజధాని తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని దేవినేని ఉమా, బోండా ఉమా హెచ్చరించారు.

Related Posts