ఆరెస్టులు...నినాదాలు
అమరావతి జనవరి 3
రాజధాని రైతుల పోరు 17వ రోజుకు చేరింది. నేటి నుంచి ఉద్యమం మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు. మందడం, తుళ్లూరు లో మహాధర్నాలు నిర్వహించారు. వెలగపూడి లో 17వ రోజు రిలే నిరాహారదీక్ష చేసారు. కృష్ణాయపాలెంలో చండీ హోమం నిర్వహించారు. మంగళగిరి అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్షకు దిగింది. ఎర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాల్లోనూ రైతులు నిరసనలకు దిగారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు, మందడంలో తీవ్ర ఉదృత్త వాతావరణం నెలకొంది. మహిళలను అరెస్ట్ చేసారు. అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న మహిళలు మండిపడ్డారు. పోలీసుల ప్రవర్తన దారుణం అని నినాదాలు చేసారు.