YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆరెస్టులు...నినాదాలు

ఆరెస్టులు...నినాదాలు

ఆరెస్టులు...నినాదాలు
అమరావతి జనవరి 3 
రాజధాని రైతుల పోరు 17వ రోజుకు చేరింది. నేటి నుంచి ఉద్యమం మరింత ఉదృతం చేయాలని నిర్ణయించారు.  మందడం, తుళ్లూరు లో మహాధర్నాలు నిర్వహించారు. వెలగపూడి లో 17వ రోజు రిలే నిరాహారదీక్ష చేసారు.  కృష్ణాయపాలెంలో చండీ హోమం నిర్వహించారు. మంగళగిరి అంబేద్కర్ కూడలిలో  అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరాహారదీక్షకు దిగింది. ఎర్రబాలెం,  నీరుకొండ, నవులూరు గ్రామాల్లోనూ రైతులు నిరసనలకు దిగారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టారు.   మరోవైపు, మందడంలో తీవ్ర ఉదృత్త వాతావరణం నెలకొంది. మహిళలను అరెస్ట్ చేసారు. అకారణంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారన్న మహిళలు మండిపడ్డారు. పోలీసుల ప్రవర్తన దారుణం అని నినాదాలు చేసారు. 

Related Posts