YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తరలించే హక్కు ఎవరికీలేదు 

తరలించే హక్కు ఎవరికీలేదు 

తరలించే హక్కు ఎవరికీలేదు 
అమరావతి జనవరి 3 (న్యూస్ పల్స్)
ఏపీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేశినేని మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదని, అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని మాయ మాటలు చెబితే.. నమ్మి ప్రజలు ఓట్లేశారని, తప్పుచేస్తే ఇక్కడి మహిళలు చీపురుకట్టలతో తరిమి కొడతారని అన్నారు. జగన్ను గెలిపించి తప్పు చేశామని, చంద్రబాబు కట్టాడనే ప్రజావేదిక కూల్చివేయించాడని ఆరోపించారు. అశుభంతో జగన్ పాలన ప్రారంభించారని నాని అన్నారు.

Related Posts