YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసుల చర్యను ఖండించిన చంద్రబాబు

పోలీసుల చర్యను ఖండించిన చంద్రబాబు

పోలీసుల చర్యను ఖండించిన చంద్రబాబు
అమరావతి జనవరి 3 
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, మహిళలపై జరిగిన పోలీసుల దౌర్జన్యాన్ని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై దాడి హేయమని తప్పు బట్టారు. రైతులపైకి పోలీసుల వాహనాలు తీసుకెళ్లి గాయపర్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మందడంలో మహాధర్నా తీవ్ర ఉద్రిక్తతగా మారిన విషయం తెలిసిందేనని, మహిళా రైతులపై పోలీసులు దాడి చేశారన్నారు.

Related Posts