మందడంలో ఉద్రిక్త పరిస్థితి
అమరావతి జనవరి 4,
రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలపై నిన్న పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బంద్కు పిలుపుని చ్చింది. దీంతో శనివారం ఉదయం నుంచి మందడంలో బంద్ కొనసాగింది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా రైతులు ఉదయాన్నే రహదారిపైకి చేరుకుని నిరసన చేపట్టారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామంలోని తమ దుకాణాల ముందు పోలీసులు కూర్చోడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్లడానికి వీల్లేదని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు రైతులకు వాగ్వాదం జరిగింది. బంద్ కారణంగా మందడంలో దుకాణాలు మూతపడ్డాయి. రహదారిపైకి రైతులు భారీగా చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. మీరు మాకు సహకరించాలంటే... మాకు సహకరించాలంటూ రైతులు, పోలీసులు పరస్పరం కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.