కాంగ్రెస్ కుట్రలు పన్నుతోంది
కడప జనవరి 4
కేంద్ర మంత్రి దేశ రక్షణ కోసమే ఈ చట్టాలు. అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు పరివర్తన ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చారని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అన్నారు. శనివారం కడపలో అయన పర్యటించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని అన్నారు. భారత భూభాగమైన కాశ్మీర్ లో 390 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత మోడీ దే. మైనారిటీ దేశాల్లో అమలు చేయని త్రిబుల్ తలాక్ చట్టాన్ని తెచ్చాం. భారతదేశ భద్రత కోసం చట్టాలను తెస్తే వ్యతిరేకిచడం తగదని అన్నారు. పాకిస్థాన్ లో హిందువులను ఉండనివ్వడం లేదు. పాకిస్థాన్ లో పది లక్షల మంది శరణార్ధులుగా ఉన్నారు. సిటిజన్ కోసం 11ఏళ్ళ పాటు వేచిఉండాల్సి ఉంది. పౌరసత్వం కోసం 11ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను శరణార్థులుచదివించుకోలేక పోతున్నారు. రాహుల్ గాంధీ మమతా బెనర్జీ వెంట నడుస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తగవని అయన అన్నారు. మైనారిటీ వర్గాల్లో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాలని అయన అన్నారు. వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటి వెళ్తాం. సిఎఎకి మద్దతు తెలిపేందుకు 8866288662 కు మిస్డ్ ఇవ్వాలి. బీజేపీ భారీ సభ్యత్వం ఉన్న పార్టీ. పది కోట్ల మంది ప్రజల మద్దతు ఉంటే మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీ ఏమి చేయలేరని అయన అన్నారు. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ కు అందరూ మద్దతు పలకాలి. విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ కి వినిపించేలా భారత్ మాతకు జై అని నినాదాలు చేయాలని అయనఅన్నారు.