YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఎమ్మెల్యే

వైకాపా నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఎమ్మెల్యే

వైకాపా నిర్ణయాన్ని సమర్ధించిన జనసేన ఎమ్మెల్యే
తిరుమల జనవరి 04
మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.  గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు.  ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే రాపాక తెలిపారు.

Related Posts