YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలం గూటికి సాదినేని యామిని

కమలం గూటికి సాదినేని యామిని

కమలం గూటికి సాదినేని యామిని
అనంతపురం, జనవరి 4,
టీడీపీకి గుడ్ బై చెప్పిన సాధినేని యామిని బీజేపీలో చేరారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. యామినిని కేంద్రమంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని.. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు.యామిని సాధినేని రెండు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. ఆ లేఖను టీడీపీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని.. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. రెండు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె.. ఇప్పుడు బీజేపీలో చేరారు.యామిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఎన్నికల సమయంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆమె పార్టీ మారతారని జోరుగా ఊహాగానాలు వచ్చాయి.. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కూడా కలవడంతో.. కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఆమె రెండు నెలల తర్వాత పార్టీలో చేరారు

Related Posts