మంత్రి బుగ్గన క్షమాపణ చెప్పాలి
అమరావతి జనవరి 6
రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగా వైకాపా అనుకూల మీడియాతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మైత్రి అనే సంస్థతో రాజధాని భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారని బీజేపీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను కుటుంబ పోషణ కష్టతరంగ ఉన్న నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఖండిస్తున్నాను. ఒక దళిత నాయకుడిగా స్వయంకృషితో ఎదిగిన నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబని అయన ప్రశ్నించారు. రాజధాని ఆంధ్రప్రదేశ్ యువత బంగారు భవిష్యత్తు కు బాటలు వేసే ప్రాజెక్ట్. ఇవాళ వైకాపా ప్రభుత్వం రాజధానిని నాశనం చేస్తున్నారు. వ్యవస్థలు మా చేతులో ఉన్నాయి కదా అని రాజధాని మార్పు సమర్ధించుకోవడానికి నాలాంటి వారిపై ఇలాంటి ఆరోపణలు తగదు. నాపై నిరాధార ఆరోపణలు చేసినవారిపై 10కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నాం. మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పై పరువు నష్టం కేస్ తో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. రాజధాని అనేది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసేది,అలాంటి రాజధానిని తరలింపు విషయంలో ప్రజల పక్షాన పోరాడుతుందని అయన అన్నారు.
నా నోటీస్ అందిన తరువాత అయిన బుగ్గన రాజేంద్ర బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎస్సి ఎస్టీ మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన రాజేంద్ర వ్యాఖ్యలు ఉన్నాయని అయన విమర్శించారు.