YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణలోకి వచ్చేస్తాం

తెలంగాణలోకి వచ్చేస్తాం

తెలంగాణలోకి వచ్చేస్తాం
కర్నూలు, జనవరి 6  
ఏపీలో రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. మూడు రాజధానులు ఖాయమంటూ సంకేతాలు రావడంతో అమరావతిలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇటు పార్టీల్లో కూడా భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ఇటు సీమ నేతలు కూడా గ్రేటర్ రాయలసీమను తెరపైకి తెస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను సీమలో కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఇదే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ సీమను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని.. మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదన్నారు. సీఎం జగన్ సొంత కమిటీలను వేసుకొని ఓ స్క్రిప్ట్ ఇచ్చి విశాఖను రాజధాని చేయాలని సూచించారన్నారు.తెలుగు ప్రజల్ని కాంగ్రెస్ విడగొడితే.. వైఎస్సార్‌‌సీపీ రాష్ట్రాన్ని విచ్ఛన్నం చేయడానికి మూడు రాజధానులు తెరపైకి తెచ్చారన్నారు. రాష్ట్రం విడిపోయి రాష్ట్రం కష్టాల్లో ఉందని.. మూడు రాజధానుల పేరుతో కులాలు, ప్రాంతాల మధ్య వైసీపీ ప్రభుత్వం చిచ్చు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదని.. విశాఖను రాజధాని చేస్తే రాయలసీమకు దూరమవుతుందని, ప్రజలు ఇబ్బంది పడతారన్నారు.

Related Posts