YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 భూముల రేట్లు పడిపోతాయని భయం

 భూముల రేట్లు పడిపోతాయని భయం

 భూముల రేట్లు పడిపోతాయని భయం
కాకినాడ జనవరి 7 
రాజధాని అమరావతి లో దోచుకొని దాచుకున్న హెరిటేజ్ భూముల రేట్లు పడిపోతాయనే భయంతోనే చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ ఆందోళన పడుతున్నారని ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ఆరోపించా రు.తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రోజా సందర్శించారు. కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామిని, రాజరాజేశ్వరీ, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రోజాకు ఆలయ వేదపండితులు ఆశీర్వచనం చేయగా,ఈఓ సౌజన్య స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు,ప్రసాదం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన మాటలు ప్రజలు నమ్మడంలేదని ఇప్పుడు ఆయన తన భార్య భువనేశ్వరిని దింపి మొసలికన్నీరు కార్పిస్తున్నారన్నారు.
=======================

Related Posts