దేవినేని ఉమా ఇంటి వద్ద ఉద్రిక్తత
విజయవాడ రూరల్ జనవరి 7
గొల్లపూడి లోని దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులకు మద్దతుగా వద్ద రహదారి దిగ్బంధానికి బయలుదేరిన దేవినేని ఉమా ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నిర్బంధించారు. ఇంటి గేటు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల నిర్బంధం నుండి దేవినేని ఉమా ను గొల్లపూడి గ్రామస్తులు, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బయటకు తీసుకొచ్చారు. అక్కడ నుండి దేవినేని ఉమా రిలేదీక్షా శిబిరం వద్దకు చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.