YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వేడెక్కుతున్న రైతుల ఉద్యమం

వేడెక్కుతున్న రైతుల ఉద్యమం

వేడెక్కుతున్న రైతుల ఉద్యమం
విజయవాడ, జనవరి 7
రైతుల ఉద్యమం వేడెక్కింది. రైతులు, పార్టీలు జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. ఆందోనళల్లో భాగంగా మంగళవారం హైవేల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. పోలీసులు అనుమతి లేదని చెప్పినా వెనక్కు తగ్గలేదు.. జాతీయ రహదారులపై బైఠాయించారు. గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర రైతులు, జేఏసీ నేతలు హైవేపైకి వచ్చారు.. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. హైవేను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.వేలాది మంది రైతులు హైవేపైకి రావడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు తర్వాత సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.. రోడ్డుపై బైఠాయించిన వారిని పక్కకు లాగి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు తోపులాట, వాగ్వాదం జరిగింది. కొంతమంది రైతులు, జేఏసీ నేతలు పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు.ఇటు విజయవాడలో కూడా హైవేను దిగ్బంధించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో గొల్లపూడి దగ్గర జాతీయ రహదారిని దిగ్బంధించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారుల్ని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు-నిరసనకారుల మధ్య మధ్య వాగ్వాదం జరిగింది. ఇటు హైవేల దిగ్బంధం పిలుపుతో అమరావతి జేఏసీతో పాటూ టీడీపీ నేతల్ని ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు తమ నిరసనలు, దీక్షల్ని కొనసాగిస్తున్నారు.

Related Posts