బీసీజీలో జగన్కు 50 శాతం వాటాలు..
హైద్రాబాద్, జనవరి 7
ఏపీ సమగ్రాభివృద్ధి, రాజధాని వికేంద్రీకరణ కోసం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు నగరాల మధ్య రాజధాని కార్యకలాపాల పంపిణీ కోసం బీసీజీ రెండు ఆప్షన్లను ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ నివేదిక తరహాలోనే బీసీజీ రిపోర్టు కూడా ఉందని.. జగన్ సర్కారు రాజధానిని తరలించడానికి అనువుగా ఈ రిపోర్టులు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వికీపీడియా పేజీని ఎడిట్ చేశారు.అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయగా.. ఈ గ్రూప్కి 50 దేశాల్లో 90కిపైగా ఆఫీసులున్నాయి. కాగా ఇందులో జగన్, విజయసాయి రెడ్డిలకు 50 శాతం వాటాలున్నాయని, దాని ప్రస్తుత సీఈవో రిచ్ లెస్సర్ అని వికీపీడియా పేజీని ఎడిట్ చేశారు. జనవరి 3, 4 తేదీల్లో బీసీజీ వికీపీడియా పేజీని 12 సార్లు మార్చారని తెలుస్తోంది. కంపెనీ పేరును కూడా ‘బోస్టన్ బఫూన్ కన్సల్టింగ్ కంపెనీ’ అని మార్చి తమ అక్కసును వెళ్లగక్కారు. ప్రస్తుతం ఆ పేజీ నుంచి తప్పుడు సమాచారాన్ని తొలగించారు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ!ఇది ప్రతిపక్ష టీడీపీ పనేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వికీపీడియా మీద పడ్డ తెలుగు దొంగల పార్టీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీసీజీ వికీపీడియా పేజీ ఎడిటింగ్ విషయమై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డాడు. బీసీజీ వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సీఎం జగన్కు 50% వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ’’ అని ఆయన ట్వీట్ చేశారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కి, విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధం ఉందని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. బోస్టన్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య, విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్రెడ్డికి మంచి మిత్రుడని.. రోహిత్రెడ్డికి చెందిన అరబిందో ఫార్మాకు విశాఖ-విజయనగరం మధ్య వేలాది ఎకరాల భూములు ఉన్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించిన సంగతి తెలిసిందే.