కాంగ్రెస్ - బీజేపీలు ఎన్నికల పార్టీలే: ఈటెల
కరీంనగర్ జనవరి 7
కాంగ్రెస్ - బీజేపీలు ఎన్నికల పార్టీలే అని... కాంగ్రెస్ - బీజేపీ నిద్రలేచేలోపు ఎన్నికలు అయిపోతాయని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటే పైకి రాలేమమని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో హత్యలుండవని.. ఆత్మహత్యలే ఉంటాయన్నారు. దేశ చరిత్రలో జెడ్పీలు గెలిచిన పార్టీ ఏదీలేదన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాలకులు మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించొద్దని మంత్రి ఈటల సూచించారు.