రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
విశాఖపట్నం జనవరి 07
విశాఖ జిల్లా అనకా పల్లి కొత్తూరు నరసింగరావు పేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.డివైడర్ ను బైక్ ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక యువకుడు మృతి చెందా డు. వీరిద్దరూ పరవాడ రాంకీ ఫార్మాసిటీ లో విధులు ముగించు కొని కొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.కన్న కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.