YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఓటర్లకు అందుబాటులో పోలింగ్ బుత్ కేంద్రాలు

ఓటర్లకు అందుబాటులో పోలింగ్ బుత్ కేంద్రాలు

ఓటర్లకు అందుబాటులో పోలింగ్ బుత్ కేంద్రాలు
జల్ పల్లి మునిసిపల్ ఇంచార్జి కమిషనర్ మహమ్మద్ షఫీ ఉల్లా
రంగారెడ్డి జనవరి 07 
రంగారెడ్డి జిల్లా జల్ పల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా ఎక్కడి ప్రాంతాల వారికి అక్కడే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మహమ్మద్ షఫీ ఉల్లా అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మునిసిపల్ కార్యాలయంలో అన్ని పార్టీల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి  వస్తుందన్నారు.ఎక్కడి వారికి అక్కడే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వృద్ధులు, వికలాంగులు, మహిళలకు సౌకర్యవంతంగా ఉంటుందని  కమిషనర్ కు విన్నవించారు.ఇందుకు స్పందించిన కమిషనర్ స్థానికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఓటర్లవారిగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజలు పూర్తిగా సహకరించా లన్నారు.ఈసమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఓటర్లు పాల్గొన్నారు.

Related Posts