దాడులకు భయపడేది లేదు
విప్ పిన్నెల్లి
అమరావతి జనవరి 7
తన కారుపై జరిగిన దాడిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణ ఖండించారు. రాజధాని రైతుల ముసుగులో దాడులు చేయటం సరికాదు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడి చేస్తున్నారు. నా కారుపై దాడి చేస్తే రైతుల సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దాడి చేసింది రైతులు కాదు టీడీపి నాయకులు. రాజధాని రైతులు ఎవ్వరు చంద్రబాబు మాయలో పడొద్దు. దాడి వెనక చంద్రబాబు హస్తం ఉందని అయన ఆరోపించారు. ఏ సమస్య అయినా ద్వారా పరిష్కారం అవుతాయ్. చంద్రబాబు కుట్రలు ఫలించవని అయన అన్నారు. కర్రలు, రాళ్లు, తీసుకుని దాడి చేసింది రైతులు కాదు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని అయన అన్నారు.