అమరావతికి తరలివెళ్లిన టీడీపీ నేతలు
ఏలూరు జనవరి 07
ఆంధ్రరాష్ట్రానికి ఓకే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి నేతలు అమరావతికి పయణమయ్యారు.ఆచంట నియోజకవర్గం నుండి మాజీ మంత్రి సత్యనారాయణ అద్వర్యంలో టిడిపి నేతలు కార్లలో అమరావతి వెళ్లారు.చంద్రబాబునాయుడు చేపట్టిన అమరావతి రైతు దీక్షకు మద్దతుగా యాత్రను చేపట్టినట్లు మాజీ మంత్రి సత్యన్నారాయణ తెలిపారు.ప్రభుత్వం వెంటనే మూడు రాజధానుల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.