YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పిన్నెల్లి హత్యకు  కుట్ర

పిన్నెల్లి హత్యకు  కుట్ర

పిన్నెల్లి హత్యకు  కుట్ర
విజయవాడ, జనవరి 7, 
రైతుల ముసుగులో టీడీపీ.. విప్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి చేశారని మండిపడ్డారు ఏపీఐఐసీ ఛైర్మన్, ఎమ్మెల్యే రోజా. ఆయనపై దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలే అన్నారు. పిన్నెల్లిపై హత్యాయత్నం చేశారని.. కారును ధ్వంసం చేశారంటే ఎంత బలంగా కొట్టారో అర్ధమవుతోందన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యేను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె రామకృష్ణారెడ్డి కారుపై దాడి ఘటనను ఖండించారు.హైవేపై పిన్నెల్లిపై హత్యాయత్నం చేశారని.. ఆయన ఇప్పటి వరకు రాజధాని అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదన్నారు రోజా. అలాంటప్పుడు ఆయనపై ఎందుకు దాడి చేశారు.. టార్గెట్ చేశారో చెప్పాలన్నారు. చంపేయాలనే దాడి చేశారని అర్ధమౌవుతోందన్నారు. అలాగే మూడు రాజధానులను స్వాగతించిన గంటా, కేఈపై ఎందుకు దాడులు జరగలేదని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్‌పై చెప్పులు, రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబని.. పరిటాల రవి హత్య సమయంలోనూ అరాచకాలు సృష్టించారన్నారు. ఇలా అల్లర్లు, అరాచకాలు సృష్టించడం.. దానిని రాజకీయ లబ్దికోసం వాడుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు ఎమ్మెల్యే.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు అన్నారు ఏపీఐఐసీ ఛైర్మన్. ఐదేళ్లలో గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అమరావతి, రైతుల్ని నాశనం చేశారని.. ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు డ్రామాలు ఆడుతున్నారని.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.ప్రజా ప్రతినిధులకు ప్రాణ భయం కలిగించేలా.. రైతులు ముసుగులో గూండాగిరి చేసేవాళ్లపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసే అరాచకాలకు పుల్‌స్టాప్ పెట్టాలని.. ఇలా అరాచకాలు చేసి లబ్దిపొందాలని చూస్తున్న చంద్రబాబుకు బుద్ది చెప్పాలన్నారు. తన రాజకీయం కోసం మిగిలినవాళ్లను బలి తీసుకోవడమే చంద్రబాబు పని.. గతంలో మీడియావాళ్లపై, ఇప్పుడు ప్రజా ప్రతినిధులపై దాడి చేసింది రైతులా అంటూ ప్రశ్నించారు.అమరావతి పేరుతో చంద్రబాబు తన బినామీలతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నారని రోజా విమర్శించారు. భూముల రేట్లు తగ్గిపోతాయని ఆయనకు భయం పట్టుకుందని.. రాజధానిపై జగన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే.. అసెంబ్లీలో అవకాశం ఇస్తారు.. వాదనల్ని వినిపించొచ్చన్నారు. అలా కాకుండా రౌడీలు, గూండాల్లా కార్లు పగులగొడతాం.. మనుషుల ప్రాణాలు తీస్తాం, మీడియావాళ్లను కొడతామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరన్నారు. మళ్లీ ఇలా అరాచకాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Related Posts