YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 దాడుల వెనుక బాబు హస్తం

 దాడుల వెనుక బాబు హస్తం

 దాడుల వెనుక బాబు హస్తం
గుంటూరు, జనవరి 7, 
చినకాకాని వద్ద జాతీయ రహదారిపై తన కారుని అడ్డగించి ధ్వంసం చేసిన ఘటనపై ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజధాని రైతుల ముసుగులో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని.. తన కారుపై దాడి చేసిన వారిలో రైతులెవరూ లేరని ఆయన అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేశారని.. దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు.జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేస్తున్నారని సర్వీసు రోడ్డులో నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పిన్నెల్లి తెలిపారు. పెద్ద పెద్ద రాళ్లతో కారును ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్ ప్రకారమే దాడి చేశారన్న ఎమ్మెల్యే.. ఆ దారిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు వెళ్లినా దాడి చేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోందన్నారు. దాడి చేసింది నిజంగా రైతులైతే అప్పటికప్పుడు కర్రలు, రాళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించారు.తన కారుపై దాడి చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న పిన్నెల్లి.. రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని సూచించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వైసీపీ నేతలపై దాడులు చేయించి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని.. అది మంచి పద్దతి కాదని పిన్నెల్లి హితవు పలికారు.నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. రాజధాని రైతులు ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని పిన్నెల్లి ఆరోపించారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ముసుగు తీసుకుని ముందుకు రావాలన్నారు. కొజ్జోళ్లలా ఇంట్లో కూర్చుని తెరవెనుక నడపడం కాదు.. మీరు మగాళ్లైతే ముందు నుంచి రావాలని సవాల్ విసిరారు. డైరెక్ట్‌గా తమను టచ్ చేస్తే ఏం జరగాలో అది జరుగుతుందంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Related Posts