రాష్ట్రం అప్పుల పాలయింది
నల్లగొండజనవరి 8
నార్కట్ పల్లి వివేర హోటల్ లో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.నల్గోండ ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీ కి హజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ రాష్టంలో ప్రశ్నించే గొంతు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రాష్టాన్ని అప్పుల పలు చేసి ఏ ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. సీఎం కేసీఆర్ కేంద్రంలో మోడీ పాట రాష్టంలో ఒవైసీ పాట పడుతూ ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాడు. దీన్ని ముస్లిం మైనారిటీలు గ్రహించాలని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో 14 గ్రూపులు ఉన్న కాంగ్రెస్ పార్టీ డిపైన్డ్ ఐనది క్యాడర్ మీదనే. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేమని కేటీఆర్ ఒప్పుకున్నాడు. ఈ ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలవుతుంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.