YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత

అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి జనవరి 10, 
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.శుక్రవారం ఉదయం  రాజధాని ప్రాంతం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మందడం, తుళ్లూరులో రైతులు, మహిళల నిరసనలతో హోరెత్తింది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని అడ్డుకుని ప్రజలు ముందుకు వెళ్లారు. రాజధానిలో పోలీసుల తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Related Posts