YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి స్పస్టం చేయాలి: పవన్‌ కల్యాణ్‌

 రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి స్పస్టం చేయాలి: పవన్‌ కల్యాణ్‌

 రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి స్పస్టం చేయాలి: పవన్‌ కల్యాణ్‌
గుంటూరు జనవరి 10  

 రాజధాని తరలింపుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్‌కల్యాణ్ సమవేశం అయ్యారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. నేతలతో సమావేశం తర్వాత రైతులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి చెప్పాల కోరారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తుచేశారు. రాజధానిపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భూములిచ్చిన రైతులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.

Related Posts