YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 27వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం  

 27వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం  

 27వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం  
విజయవాడ జనవరి 13 
రాజధాని అమరావతి రైతుల పోరాటం  27వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాలలో నేడు మహా ధర్నాలు నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. అదే విధంగా వెలగపూడి, కృష్ణాయపాలెంలో 27వరోజు రైతు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్ధండరాయినిపాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు నిరసన తెలుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మనసు మారాలని అక్కడి మహిళల పూజలు చేస్తున్నారు.నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం, ఇతర రాజధాని గ్రామాల్లో రైతు నిరసనలు కొనసాగనున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళనలు, ర్యాలీలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. అందుకే ప్రవేటు ప్రదేశాల్లో రైతులు నిరసనలు కొనసాగించనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల ఆందోళనలు తెలుపుతున్నారు.

Related Posts