YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: మంత్రి బొత్స

 రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: మంత్రి బొత్స

 రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: మంత్రి బొత్స
అమరావతి జనవరి 13
రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. రాజధాని రైతుల విషయంలో ప్రభుత్వానికి సానుభూతి ఉందని తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తన వద్దకు వచ్చారని, తమ సమస్యలు చెప్పారని తెలిపారు. అసలు అసైనీలకు కాకుండా, వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని కోరినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రాజధాని రైతులు తమ వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇదే చివరి సమావేశం అని చెప్పలేమని బొత్స తెలిపారు. అవసరాన్ని బట్టి సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగుల తరలింపు అంశాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి అనేది తమ ప్రభుత్వ అజెండా అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Related Posts