YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబువి తప్పుడు ప్రచారాలు

చంద్రబాబువి తప్పుడు ప్రచారాలు

చంద్రబాబువి తప్పుడు ప్రచారాలు
తాడేపల్లి జనవరి 13 
అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని రాజధాని ప్రాంత రైతులు కూలీలు కోరుతున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత రైతులు కోరుకుంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలు తో పాటు మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత వాసులు కోరుకుంటున్నారు. మా భూముల తీసుకొని చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు భూముల బలవంతంగా లాక్కున్నారు. రాజధానిలో జరగనివి ఇక్కడ జరుగుతున్న ట్లుగా ప్రచారం చేస్తున్నారని అయన ఆరోపించారు. నిన్ను నమ్మి మోసపోయిన రైతులు జోల పట్టుకొనేల చేశావు. పోలీసులను పట్టుకొని చంద్రబాబు బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే డీజీపీతో తప్పుడు ప్రచురించి చేయించావని చంద్రబాబుపై మండిపడ్డారు. తాహసీల్దార్ వనజాక్షి,  ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం పై దాడి జరిగితే పోలీసు వ్యవస్థ ను నీకు అనుకూలంగా మలచుకున్నావు. డీజీపీ సవాంగ్ ను ఉత్తరాది వాడు అంటున్న చంద్రబాబు. చంద్రబాబు పెట్టిన డీజీపీ ఎవరు.. ఉత్తరాది వాడు కాదా అని నిలదీసారు.  బినిమి ఆస్తులు కాపాడు కోవడం కోసం జోల పడుతున్నావు. హెరిటేజ్ కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందగా ఇచ్చారు. పండిన పంటలను చంద్రబాబు తగల బెట్టించారు. చంద్రబాబు లోకేష్ జీతాలు ఎందుకు జోలలో వేయలేదు. పోలీసులకు కులాలు మతాలు ప్రాంతాలు అంటకడుతున్నావు. సెక్షన్ 144, 30 అమల్లో ఉండగా ఎలా శిబిరాలు దీక్షలు పెడతారని అళ్లా ప్రశ్నించారు. 

Related Posts