రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: జేఏసీ
గుంటూరు జనవరి 14
: ఏపీ రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఈనెల 20న జైల్భరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. రాజధాని ఉద్యమం పట్ల పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. హైకోర్టు ఇంటీరియమ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని, మూడు రాజధానుల రెఫరెండంతో జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేతలు గల్లా జయదేవ్, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు డిమాండ్ చేశారు.