YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజాసింగ్‌ గృహ నిర్బంధం

రాజాసింగ్‌ గృహ నిర్బంధం

రాజాసింగ్‌ గృహ నిర్బంధం
హైద్రాబాద్, జనవరి 14  
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. భైంసాలో జరిగిన హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను ముందస్తుగా కట్టడి చేశారు. ఈ మేరకు రాత్రి నుంచి రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌తోపాటు, ఎంఐఎం, కాంగ్రెస్‌పైనా ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఛలో భైంసాకు పిలుపునివ్వడంతో పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.భైంసాలో చెలరేగిన హింసాత్మక ఘటనను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు. కొందరు వ్యక్తులు ఇళ్లను ధ్వంసం చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భైంసా పరిధిలో శాంతిభద్రతలను కాపాడాలని తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీకి ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి రెండు మతాలకు చెందిన వారి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16 ఇళ్లతో పాటు 23 బైకులు, 2 ఆటోలు ధ్వంసమయ్యాయి. దీన్ని కట్టడి చేసే క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. శాంతిభద్రతలను కాపాడేందుకు 2 బెటాలియన్ల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. అంతేకాక, వదంతులు వ్యాప్తి చెందకుండా ఇంటర్నెట్‌నూ నిలిపివేశారు. భైంసాలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. గాయపడిన పోలీసుల్లో నిర్మల్ ఎస్పీ శశిదాహర్ రాజు, డీఎస్పీ నర్సింగ్ రావు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ రావు ఉన్నారు

Related Posts