YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కాకినాడలో పవన్ కల్యాణ్ 

కాకినాడలో పవన్ కల్యాణ్ 

కాకినాడలో పవన్ కల్యాణ్ 
కాకినాడ జనవరి 14
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పంతం నానాజీ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన..14 మంది జనసైనికులను పరామర్శించారు. దాడి ఘటన, ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలను కార్యకర్తలు పవన్‌కు వివరించారు. కాగా పవన్ కాకినాడ పర్యటనకు వస్తుండటంతో.. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో.. కాకినాడలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేశారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ఈనెల  ఆదివారం (12వ తేదీ) రణరంగంగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో వారిపై ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులు చేసిన విషయం తెలిసిందే.

Related Posts