ఘోర రైలు ప్రమాదం..20మందికి పైగా క్షతగాత్రులు..!
విషమంగా ఆరుగురి పరిస్థితి
భువనేశ్వర్ జనవరి 16,
ఒడిశాలో కటక్ సమీపంలోని సలాగావ్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళ్తున్న లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు ముందున్న గూడ్స్ రైలును ఢీకొంది.గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఏడు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. 20 మందికి పైగా గాయపడ్డారు. దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నారు. గాయపడిన వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం నేపధ్యంలో పూరి-రూర్కేల ఎక్స్ ప్రెస్,పూరి-దుర్గ్ ఎక్స్ ప్రెస్,ధన్ బాద్-భువనేశ్వర్ రాజ్యరాణి ఎక్స్ ప్రెస్, తాల్చేర్-పూరి ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్-ముంబై లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లను దారి మళ్లించారు.