YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యాడియురప్పకు మఠాధిపతుల ప్రేషర్

యాడియురప్పకు మఠాధిపతుల ప్రేషర్

యాడియురప్పకు మఠాధిపతుల ప్రేషర్
బెంగళూరు జనవరి 16,
కర్ణాటక ముఖ్యమంత్రి యాడియురప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావటంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దావణగెరె జిల్లా హరిహరలో నిర్వహించిన బహిరంగ సభలో వీరశైవ పంచమశాలి సముదాయానికి చెందిన వచనానందస్వామి ముఖ్యమంత్రిని నేరుగా పలు ప్రతిపాదనలు చేశారు. తమ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మురుగేశ్ నిరాణి, మహేశ్ కుమటహళ్లిలకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని వేదికపైనే ప్రతిపాదించారు.దీనిపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.మఠాధిపతులు సూచనలివ్వాలే కానీ హెచ్చరిస్తే ఎలాగ అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని విన్నవించారు. అసలే ఆర్థిక సమస్యతో సతమత మవుతున్న నాకు మంత్రివర్గ విస్తరణ కూడా పెద్ద సమస్యగా ఉందన్నారు.

Related Posts